ఎమ్మెల్యేల విజిట్.. మేడిగడ్డ దగ్గర హై సెక్యూరిటీ..

ఎమ్మెల్యేల విజిట్.. మేడిగడ్డ దగ్గర హై సెక్యూరిటీ..

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డకు మరికాసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్యే బృందం చేరుకోనుంది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనల చోటుచేసుకోకుండా.. బార్డర్ లో ఎలాగైతే పహారా కాస్తారో.. అదే రేంజ్ లో మడిగడ్డ దగ్గర పోలీసులు హై సెక్యూరిటితో కిలోమీటర్ల పొడువున పహారా నిర్వహిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. అయితే, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం మేడిగడ్డ సందర్శనకు దూరంగా ఉన్నారు. ఈరోజు నల్లగొండలో కేసీఆర్ నేతృత్వంలో బహిరంగ సభ జరగనుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లగొండకు బయల్దేరి వెళ్లారు.