తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

భారతదేశంలో కరోనా వైరస్ అంతం కావడం లేదు. ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 43,469,234కి చేరుకుంది. మరో 23 మంది కరోనాతో మృతి చెందారు. 14, 143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే.. శుక్రవారం 462 కేసులు నమోదవుతే.. 24 గంటల్లో 516 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 434 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 01, 922 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.89 శాతంగా ఉందని, మొత్తం 26 వేల 976 టెస్టులు నిర్వహించడం జరిగిందని వెల్లడించింది. 

జిల్లాల వారీగా కేసులు :-
ఆదిలాబాద్ 03, భద్రాద్రి కొత్తగూడెం 15, హైదరాబాద్ 261, జగిత్యాల 03, జనగాం 07, జయశంకర్ భూపాలపల్లి 01, జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 02, కరీంనగర్ 07, ఖమ్మం 09, కొమరంభీం ఆసిఫాబాద్ 02, మహబూబ్ నగర్ 02, మహబూబాబాద్ 03, మంచిర్యాల 34, మెదక్ 03, మేడ్చల్ మల్కాజ్ గిరి 43, ములుగు 09, నాగర్ కర్నూలు 00, నల్గొండ 07, నారాయణపేట 00, నిర్మల్ 00, నిజామాబాద్ 03, పెద్దపల్లి 02, రాజన్న సిరిసిల్ల 05, రంగారెడ్డి 43, సంగారెడ్డి 24, సిద్ధిపేట 07, సూర్యాపేట 06, వికారాబాద్ 02, వనపర్తి 01, వరంగల్ రూరల్ 00, హన్మకొండ 05, యాదాద్రి భువనగరి 07. మొత్తం : 516