రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,397మందికి కొవిడ్ టెస్టులుచేయగా.. 3,603 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,421మంది కరోనా బారినపడగా.. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 308, రంగారెడ్డిలో 262, హనుమకొండలో 150, కరీంనగర్ లో 98 మందికి కొవిడ్ సోకింది. ఇవాళ 2,707 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉండగా.. రికవరీ రేటు 95.08 శాతంగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 32,094 యాక్టివ్ కేసులున్నాయి. 

For more news..

వనస్థలిపురంలో 2 ఆర్టీసీ బస్సులు ఢీ

నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదాని