'స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్‌'లో తెలంగాణ నంబర్ వన్

'స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ్‌'లో తెలంగాణ నంబర్ వన్

సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం "స్వచ్ఛ భారత్‌ సర్వేక్షణ" లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు.  ఇది రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శవంతమైన, పారదర్శక పాలనకు మరోసారి అద్దం పడుతోందని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద పలు విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం 13 అవార్డులను గెలుచుకోవడంతోపాటు దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల  సీఎం  హర్షం వ్యక్తం చేశారు. 

సమిష్టి కృషితో, పల్లె ప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం తెలిపారు.  'పల్లె ప్రగతి' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, శాఖ ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచులను, ఎంపిటిసిలను, గ్రామ కార్యదర్శులను సీఎం ఈ సందర్భంగా అభినందించారు.

దేశ ప్రగతిలో తన వంతుగా గుణాత్మక భాగస్వామ్యం పంచుకోవడం ప్రతీ తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భమని, ఇదే పరంపరను కొనసాగిస్తామని సీఎం పేర్కొన్నారు.