ములుగు జిల్లాలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన 

ములుగు జిల్లాలో ఇవాళ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన 

ములుగు : ములుగు జిల్లా ఏజెన్సీలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. -వెంకటాపురం మండలం ఆలుబాకలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించనున్నారు. -తెలంగాణ, ఛత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతంలో డీజీపీ పర్యటన సందర్భంగా ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. -విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో వెంకటాపురం మండలంలో డీజీపీ మహేందర్ రెడ్డి మూడోసారి పర్యటిస్తున్నారు. డీజీపీ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.