రాష్ట్ర అవతరణ వేడుకలు సెక్రటేరియెట్‌లోనే

రాష్ట్ర అవతరణ వేడుకలు సెక్రటేరియెట్‌లోనే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2న సెక్రటేరియెట్‌లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వ కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై సీఎం అధ్యక్షతన సెక్రటేరియెట్‌లో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. అధికారిక కార్యక్రమాల ను ఎలా నిర్వహించాలనే దానిపై సీఎం చర్చిం చారు. సచివాలయంలో స్టేజీ ఏర్పాటు సహా పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, జాతీయ జెండా ఎగురవేయడం, ఆహ్వానితులకు పా ర్కింగ్ సౌకర్యం తదితరాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 21 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాల ఏర్పాట్ల గురించి చర్చించారు. పదేండ్ల రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని, వ్యవసాయం, విద్యుత్, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లెపల్లెన వివరిస్తూ.. ప్రజల భాగస్వామ్యంతో వేడుకలు నిర్వహించుకోవాలని ఆదేశించారు.