
తెలంగాణలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. జూన్ 3 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 42 వేల 832 మంది విద్యార్థులు పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు రాయనున్నారు. హాల్ టికెట్లు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది విద్యాశాఖ.
రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది హాజరయ్యారు. మొత్తం పదో తరగతి పరీక్షలో 92.78 ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఉత్తీర్ణత 91.32సాధించగా, బాలికలు 94.26 శాతం సాధించారు. బాలికల కంటే బాలురు 2.64 అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ప్రైవేట్ స్కూల్స్ లో పాస్ పర్సంటేజ్ 57.22 శాతం. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 55.14 శాతంగా ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 61.70 శాతంగా ఉంది. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 6.56 శాతం అధికం.
►ALSO READ | Job News: ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలోని 4 వేల 629 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం 2 పాఠశాలలు మాత్రమే పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎవరూ పాస్ కాలేదు.ఈ సారి ఫలితాల్లో సబ్జెక్ట్ లకు గ్రేడ్లకు బదులు మార్కులు ఇచ్చారు. అత్యదికంగా ఉత్తీర్ణతో మహబూబాబాద్ ఫస్ట్ ప్లేసులో ఉండగా..అతి తక్కువ ఉత్తీర్ణతతో వికారాబాద్ చివరి స్థానంలో ఉంది.