హైదరాబాద్, వెలుగు: ఇక టెన్త్ స్టూడెంట్ల వాట్సాప్కే ఆన్సర్షీట్లు అందనున్నాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకున్న పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం గుడ్ న్యూస్ చెప్పింది. పాత పద్ధతిలో పోస్టల్ద్వారా జిరాక్స్ కాపీలను పంపే కష్టాలకు చెక్పెట్టింది. డైరెక్ట్గా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఆన్సర్ షీట్లను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అంటే విద్యార్థులు రాసిన పేపర్లను వెదికి, జిరాక్స్ తీసి, వాటిని పోస్ట్ ద్వారా పంపించేవారు. సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ వచ్చినా కూడా చాలా మందికి ఈ పేపర్లు అందేవి కావు. ఈ ఆలస్యాన్ని ఆపేందుకే తొలిసారిగా ‘డిజిటల్ వాల్యుయేషన్’ (రీ కౌంటింగ్) నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
స్టూడెంట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్న వాట్సాప్, మెయిల్కే పేపర్ను పంపించనున్నారు. దీంతో టైమ్ సేవ్ కావడంతో పాటు సర్కార్కు కూడా ఖర్చు ఆదా కానుంది. ఈ కొత్త సిస్టమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 20 స్పాట్ సెంటర్లను అధికారులు సిద్ధం చేశారు. ఆన్లైన్లోనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పని పూర్తి చేసి వెంటనే డిజిటల్ కాపీలను విద్యార్థులకు పంపిస్తారు. ఈ నెల 30 నుంచి మే 14 వరకూ విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. పరీక్షల విభాగంలో తొలిసారిగా ఇలాంటి కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంపై విద్యార్థులు, పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
