రెండు లక్షల జాబులు భర్తీ చేయాలి

రెండు లక్షల జాబులు భర్తీ చేయాలి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం నీల వెంకటేష్ అధ్యక్షతన ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన నిర్వహించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది.. 

మెగా డీఎస్సీ, పోలీస్, గ్రూప్ నియామకాలు, వివిధ శాఖల్లో ఉద్యోగుల భర్తీ ఎప్పుడని ప్రశ్నించారు. ధర్నాకు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. 18 నెలల పాలనలో 60 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జాక్​ నాయకులు అశోక్, అనంతయ్య, మోడీ రాందేవ్, పగిళ్ల సతీశ్​ పాల్గొన్నారు.