
- సముద్రంలో కలిసే నీళ్లనే మేం వాడుకుంటాం: ..
- దీనిపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నరు
- హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే
- ఏపీ, తెలంగాణ తనకు రెండు కండ్ల లాంటివని వ్యాఖ్య
కడప: ఏపీ సర్కారు నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. కడప జిల్లాలో జరుగుతున్న ఆ పార్టీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సముద్రంలో కలిసే నీటిని కాపాడుకోవడమే తమ ప్రణాళిక అని చెప్పారు.
నదుల అనుసంధానంపై తెలంగాణకు కూడా లాభమేనన్నారు. దీనిపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఏపీ, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివన్నారు.
హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనన చెప్పారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం.. ఆ తర్వాత నీళ్లు సముద్రంలోనే కలుస్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి.. రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే.. ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు.
బీఆర్ఎస్ పార్టీ వాళ్లు ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్లు గోదావరిపై కాళేళ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు నేనెప్పుడు కూడా అభ్యంతరం తెలపలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నాకు రెండు కండ్లని ఆ రోజే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే. ఘంటాపథంగా చెప్పగలుగుతాను’’అని చంద్రబాబు అన్నారు.