- ప్రైజ్ మనీ రూ.3 లక్షలు, వెండి గద
- అంజన్ కుమార్ యాదవ్ వెల్లడి
బషీర్బాగ్, వెలుగు: ఎల్బీ స్టేడియంలో మే 7 నుంచి 10 వరకు ‘తెలంగాణ కేసరి 2026’ పేరుతో ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అసోసియేషన్ సెక్రటరీ జనరల్ గౌరవ్ రోషన్ లాల్ సచిదేవ్తో కలిసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
ఈసారి పురుషులతో పాటు తొలిసారిగా ‘తెలంగాణ కుమారి’ పేరిట మహిళలకు కూడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుమారు 500 మంది రెజ్లర్లు పాల్గొనే ఈ పోటీల్లో పురుషుల విజేతకు రూ. 3 లక్షల నగదుతో పాటు వెండి గదను, మహిళా విజేతకు రూ. లక్ష నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వివరించారు. ఈ వేడుకకు సీఎంతో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నట్లు అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
