సహజ కవి అందె శ్రీకి నివాళులు అర్పిస్తున్నారు ప్రముఖులు. ప్రభుత్వ లాంఛనాలతో ఘట్ కేసర్ లో ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తాతోపాటు ఇతర అధికారులు అంత్యక్రియల ఏర్పాట్లు సమీక్షించారు.
ఘట్ కేసర్ లో అందె శ్రీ అంతిమ యాత్రలో 500 మంది కళాకారులు ఆటపాటలతో నివాళులు అర్పించారు. యాత్ర సాగుతున్నంతసేపు కళాకారులు ఆడిపాడారు. ఈ యాత్రలో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అంతిమ యాత్రలో భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సమీక్షించారు. అంతిమ యాత్రలో వేలాది మంది ఘట్ కేసర్ జనం తరలివచ్చారు. అమర్ రహే అందె శ్రీ అంటూ నినాదాలు చేశారు. కళాకారుడిగా.. తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంది.
