చెన్నై: తమిళ నటి వీజే చిత్రా (28) సూసైడ్ చేసుకుంది. చెన్నైలోని ఓ హోటల్లో ఆమె ఉరి వేసుకొని చనిపోయింది. నేషనల్ మీడియా సమాచారం ప్రకారం.. హేమంత్ అనే బిజినెస్మెన్తో రీసెంట్గా చిత్రకు ఎంగేజ్మెంట్ అయ్యింది. దీనికి సంబంధించి రెండు ఫొటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. కొన్నాళ్ల నుంచి హేమంత్తో కలసి చెన్నైలోని ఒక ప్రైవేటు హోటల్లో చిత్ర ఉంటోంది. పాండియన్ స్టోరీస్ అనే సీరియల్ షూటింగ్లో మంగళవారం చిత్ర పాల్గొంది. ఆ తర్వాత వేకువ జామున 2.30 గంటలకు ఆమె తిరిగి హోటల్కు చేరుకుంది.
ఫ్రెషప్ అయ్యి తిరిగి వస్తానని గదిలోకి వెళ్లిన చిత్ర తిరిగిరాలేదు. ఆమె రూమ్కు లోపలి వైపు నుంచి లాక్ వేసి ఉందని గ్రహించన హేమంత్.. డూప్లికేట్ తాళం కోసం హోటల్ స్టాఫ్ సాయం కో్రాడు. తాళం తీసి లోపలికి వెళ్లే సరికి చిత్ర సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో హోటల్ స్టాఫ్ నజ్రత్పేట్టయి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ ఘటనపై విచారణను కొనసాగిస్తున్నారు. వీజే చిత్ర హఠాన్మరణం ఆమె ఫ్యాన్స్తోపాటు కొలీగ్స్ను షాక్కు గురి చేసింది. తమిళ పాపులర్ డైలీ సీరియల్ పాండియన్ స్టోరీస్లో చిత్ర నటించిన ముల్లయి పాత్రకు చాలా పాపులారిటీ దక్కింది. టీవీ పరిశ్రమను ఆమె మరణం షాక్కు గురి చేసింది.