మార్కులు తగ్గాయని చితకబాదిన తెలుగు టీచర్

మార్కులు తగ్గాయని చితకబాదిన తెలుగు టీచర్

ఖమ్మం రూరల్, వెలుగు: మార్కులు తక్కువ వచ్చాయని ఖమ్మంలోని ట్రైబల్ ​వెల్ఫేర్ ​స్కూల్​టీచర్ టెన్త్ ​క్లాస్ ​స్టూడెంట్లను చితకబాదాడు. వివరాల్లోకి వెళ్తే.. తిరుమలాయపాలెం మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ ​స్కూల్​లో టెన్త్​చదువుతున్న ఏడుగురికి మార్కులు తగ్గాయని తెలుగు టీచర్​లక్ష్మణ్ కర్రతో చితకబాదాడు. వీపులు కందిపోయేలా కొట్టాడు. తట్టుకోలేకపోయిన చిన్నారులు వెంటనే తల్లిదండ్రులకు ఫోన్​చేసి ‘మేం బతకలేం.. చచ్చిపోతాం’ అంటూ బాధపడ్డారు. 

తల్లిదండ్రులు స్కూల్​ వద్దకు చేరుకుని  ఆందోళనకు దిగారు. హైవే మీద రాస్తారోకో చేపట్టారు. పిల్లలను కొట్టిన టీచర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మార్కులు తగ్గితే ఇలా కొట్టాలా అని ప్రశ్నించారు. స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి తమ సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ పుల్లారావుతో మాట్లాడారు. ఆందోళన విరమింపజేశారు.