
సురవరరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ 2025 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్- నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రెగ్యులర్ కోర్సుల వివరాలతో ఎంట్రెన్స్ నోటిఫికేషన్ ను సోమవారం (మే 26) రిలీజ్ చేశారు. హైదరాబాద్, వరంగల్ ప్రాంగణాల్లో శిల్పం - చిత్రలేఖనం (Sculpture and Arts), డిజైన్, సంగీతం, రంగస్థలం (theatre arts), శాస్త్రీయ నృత్యం (కూచిపూడి, ఆంధ్రనాట్యం), జానపదం (Folk Arts), తెలుగు, చరిత్ర-పర్యాటకం, భాషాశాస్త్రం, జ్యోతిష్యం, యోగా కోర్సులకు ప్రవేశ ప్రకటన జారీ చేశారు.
ఆసక్తి గల అభ్యర్థులు సాధారణ రుసుముతో జూన్ 24 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఒక వేళ గడువులోపు పూర్తి చేయని వారు ఆసల్య రుసుము (లేట్ ఫీ)తో జూన్ 30 వరకు అప్లై చేసుకోవచ్చునని అధికారులు సూచించారు.
తెలుగు యూనివర్సిటీ అందిస్తున్న వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే అభ్యర్థులు ఏదేని డిగ్రీ, ఎంఏ, పి.జి.డిప్లొమా, డిప్లొమా, సర్లిఫికేట్ ప్రోగ్రాం కోర్సుల అర్హత కలిగి ఉండాలి.
పూర్తి వివరాల కోసం ఈ కింది వెబ్ సైట్లను విజిట్ చేయగలరు.
www.teluguuniversity.ac.in & www.pstucet.org వెబ్ సైట్ల లింకు క్లిక్ చేసి ఆన్ లైన్ లో అప్లై చేయగలరు.