రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా వానలతో కొంత మేర తగ్గిన ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లా షమ్మిలో నిన్న 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజుల్లో ఇదే అత్యధికం. ఇవాళ, రేపు అధిక ఉష్ణోగ్రతలతో వేడి, ఉక్కపోతలు  ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత్ ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో పొడిగాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో.. రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం

రాజమండ్రి జైలుకు ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు

రాజ్యసభ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల