రంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి

రంగారెడ్డి జిల్లాలో భూ వివాదంలో గాయపడ్డ నర్సింహా రెడ్డి మృతి

రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడలో భూ వివాదంలో ఈనెల 3వ తేదీన గాయపడ్డ కందాడ నర్సింహా రెడ్డి అనే వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈనెల 3వ తేదీన పక్కభూమి యజమానులు నర్సింహా రెడ్డిపై దాడి చేయడంతో  తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న నర్సింహా రెడ్డి ఇవాళ మృతి చెందాడు.

నర్సింహా రెడ్డిపై దాడి చేసిన రోజే బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నర్సింహా రెడ్డిపై దాడికి పాల్పడిన జనార్దన్ రెడ్డి, జంగారెడ్డి, శ్రీకాంత్ ను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలిచారు. నర్సింహా రెడ్డి మృతితో గ్రామంలో ఉద్రిక్తత తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. తుర్కుగూడ గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.