తెలంగాణ,ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత

 తెలంగాణ,ఏపీ సరిహద్దులో ఉద్రిక్తత

ఏపీ,తెలంగాణ బార్డర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనుమతులు లేకుండా ఏపీ నుండి వచ్చే అంబులెన్స్ వాహనాలను అపడాన్ని నిరసిస్తూ కరోనా పేషంట్ల బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.  కర్నూల్ పుల్లూర్ టోల్ ప్లాజా నుండి ఏపీలోకి ప్రవేశించే వాహనాలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో బాధితులు తెలంగాణ పోలీసులతో  వాగ్వాదానికి దిగారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ బార్డర్ అయిన పంచలింగాల వద్ద ఆందోళన చేసుకోవాల్సిందిగా పోలీసులు వారికి సర్ది చెప్పారు.