హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల1న ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్కు మొత్తం 3.48 లక్షల మంది, టెన్త్ పరీక్షలకు 55 వేల మంది హాజరయ్యారు. గత నెలలో ఇంటర్ కాలేజీలు ప్రారంభం మరోపక్క డిగ్రీ దోస్త్ రెండో విడత అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఈనెలాఖరులోగా ఫలితాలు ఇచ్చేందుకు ఇంటర్, ఎస్ఎస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఈ నెల 13 నుంచి ఇంటర్ స్పాట్, 16 నుంచి 18 వరకు టెన్త్ స్పాట్ వాల్యువేషన్ చేపట్టనున్నారు.