
హాజరుకానున్న 1,90,328 మంది స్టూడెంట్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో శుక్రవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 1,90,328 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్రాయనున్నారు. వీరిలో హైదరాబాద్ జిల్లాలో 77,701, రంగారెడ్డి జిల్లాలో 51,794, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 47,930, వికారాబాద్జిల్లాలో 12,903 మంది ఉన్నారు. ఏప్రిల్4 వరకు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఒక్కో ఎగ్జామ్హాల్లో 20 మంది విద్యార్థులను కేటాయించారు. హెచ్ఎం ఆఫీస్లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పరీక్ష పేపర్లు తెరవడం, జవాబు పత్రాలు సీల్ చేయడాన్ని మానిటరింగ్చేయనున్నారు. కాపీయింగ్జరగకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. సెంటర్ల వద్ద సిబ్బంది మొబైల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నాపత్రంపై ఈసారి క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ఉండనుంది. దీనివల్ల ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీక్ అయితే వెంటనే తెలిసిపోతుందని అధికారులు తెలిపారు.