
హైదరాబాద్, వెలుగు: లా ఆఫీసర్ పోస్టుకు అప్లికేషన్గడువును టీజీపీఎస్సీ మరో ఆరు రోజులు పొడిగించింది. నియామకాల విషయంలో ఎదుర్కొంటున్న లీగల్ కేసులను స్టడీ చేసి వాదించేందుకు లీగల్సెల్ను ఏర్పాటు చేసిన కమిషన్.. ప్రభుత్వ ఆదేశాల మేరకు లా ఆఫీసర్ పోస్టును క్రియేట్ చేసింది.
ఆ పోస్టుకు ఈ నెల 12న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసి ఐదేండ్లు అనుభవం ఉన్న ఎల్ఎల్ఎం/ఎల్ఎల్బీ అభ్యర్థులు అర్హులని పేర్కొంటూ జూన్ 30 వరకు గడువు విధించింది. తాజాగా ఆ గడువును జులై 6 సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది.