హైదరాబాద్: విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారంటూ తన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై దాఖలైన రెండు పిటిషన్లను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేస్తూ తీర్పు వెలువరించడంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదు చేసని రెండు క్రిమినల్ కేసుల్లో నిర్దోషిగా తేల్చింది ఎంపీ/ఎమ్మెల్యేల స్పెషల్ కోర్టు తేల్చిందన్నారు. మా కోసం ప్రార్థనలు ,మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ విలువైన సహాయాన్ని అందించిన న్యాయవాది అబ్దుల్ అజీమ్ ఎస్ బి సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అసదుద్దీన్ ఒవైసీ.
ఇవి కూడా చదవండి
ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు
అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత
కేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు