నాలుగైదు రోజుల్లో వెబ్​సైట్​లో టెన్త్ హాల్ టికెట్లు

నాలుగైదు రోజుల్లో వెబ్​సైట్​లో టెన్త్ హాల్ టికెట్లు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23 నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్​టికెట్లు రెడీ అయ్యాయి. వాటిని సోమవారం నుంచి స్కూళ్లకు పంపించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. వారంలోపు అన్ని స్కూళ్లకు చేరుతాయని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో ప్రభుత్వ పరీక్షల విభాగం వెబ్​సైట్​లోనూ పెట్టనున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా టెన్త్ హాల్​టికెట్ నెంబర్​తో పాలిసెట్​కు అప్లై చేసుకునే అవకాశం ఉండటంతో, సోమవారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది.