సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించండి

సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించండి

సభ సజావుగా నడిచేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఇవాళ అఖిల పక్ష భేటీ నిర్వహించారు. 17వ లోక్ సభ తొమ్మిదో సెషన్ లో సభ 18 రోజులు పని చేస్తుందని, మొత్తం 108 గంటల పాటు సమావేశాలు జరుగుతాయని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఈ సెషన్ లో ప్రభుత్వ బిజినెస్ కోసం 62గంటలు కేటాయించినట్లు చెప్పారు. జీరో అవర్ నోటీసులకు సమయం మార్చిన విషయాన్ని స్పీకర్ గుర్తు చేశారు. 

మరోవైపు ఆదివారం (జులై 17న) సాయంత్రం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అన్ని పక్షాల నేతలతో వెంకయ్య నాయుడు భేటీ కానున్నారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరనున్నారు.