ప్రేమికుడితో కలిసి ఉండేందుకు.. కొడుకును చంపేసింది

ప్రేమికుడితో కలిసి ఉండేందుకు.. కొడుకును చంపేసింది

ప్రేమికుడితో కలిసి ఉండేందుకు.. కొడుకును చంపేసింది
డెడ్​బాడీని మాయం చేసి కనిపించట్లేదంటూ 
పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టిన పోలీసులు.. సూరత్​లో ఘటన

సూరత్ : ప్రేమికుడితో కలిసి ఉండేందుకు ఓ మహిళ తన కన్న కొడుకునే చంపేసింది. ఆ రెండేండ్ల చిన్నారి డెడ్​బాడీని మాయం చేసి, తన కొడుకు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తల్లి పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో అనుమానించిన పోలీసులు.. గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం బయటపెట్టింది. తానే చంపేసి పిల్లాడి డెడ్​బాడీని పాతిపెట్టినట్లు ఒప్పుకుంది. సూరత్​లో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు ఆదివారం మీడియాకు 
వెల్లడించారు.

పోలీసులనే పరుగులు పెట్టించింది.. 

ఝార్ఖండ్​కు చెందిన నయన మాండవి గుజరాత్​లోని సూరత్ జిల్లా దిండోలి ప్రాంతంలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తోంది. తన రెండేండ్ల కొడుకు కనిపించట్లేదంటూ గత నెల 27న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండుమూడ్రోజుల పాటు పోలీసులు గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. తల్లిని అనుమానించి అరెస్ట్ చేశారు. తొలుత తనకేమీ తెలియదని చెప్పిన మాండవి, ఝార్ఖండ్​లో ఉంటున్న తన ప్రేమికుడే కిడ్నాప్ చేసుంటాడని చెప్పింది. దీంతో పోలీసులు వెళ్లి ఆరా తీయగా ఈ వ్యవహారంతో అతడికెలాంటి సంబంధం లేదని తేలింది. ఇక ఆ తల్లినే పోలీసులు ఇంటరాగేషన్ చేయగా.. తానే పిల్లాడిన చంపేసి ఓ గుంతలో పాతిపెట్టినట్లు ఒప్పుకుంది.

అక్కడ తవ్వితే ఎలాంటి మృతదేహం దొరక్కపోవడంతో.. మరోచోట ఉందంటూ పోలీసులను పరుగులు పెట్టించింది. అక్కడా డెడ్​బాడీ దొరకలేదు. చివరికి తాను పనిచేస్తున్న సైట్​లోనే పూడ్చిపెట్టినట్లు చెప్పింది. అక్కడ్నుంచి బాలుడి డెడ్​బాడీని పోలీసులు వెలికితీశారు. ‘‘ఝార్ఖండ్​లోని ఓ వ్యక్తిని ఆమె ప్రేమించింది. అతనితో కలిసి బతకాలనుకుంది. కొడుకుతో వస్తే ఇంట్లోకి రానివ్వనని అతడు కండిషన్ పెపట్టడంతో ఏం చేయాలో తెలియక బిడ్డను చంపుకుంది”అని మాండవి చెప్పిందని పోలీసులు వెల్లడించారు.