బిడ్డను వేధిస్తున్నాడని అల్లుడిని చంపిన అత్త

బిడ్డను వేధిస్తున్నాడని అల్లుడిని చంపిన అత్త

నర్సంపేట, వెలుగు: బిడ్డను వేధిస్తున్నాడని అల్లుడిని అత్త మర్డర్​ చేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. వరంగల్​ రూరల్​ జిల్లా రాములునాయక్ తండాకు చెందిన బానోత్ ఈరు(40) కొన్నేళ్లుగా అత్తవారింట్లోనే ఉంటున్నాడు. మద్యానికి బానిసై నిత్యం భార్యతో గొడవ పడేవాడు. శుక్రవారం బానోత్​ఈరు, అతని భార్య, అత్త ఓ ఫంక్షన్​కు వెళ్లారు. వీరు ముగ్గురు మద్యం తాగి ఇంటికి వచ్చారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న అత్త క్షణికావేశంలో రోకలి బండతో ఈరు తలపై కొట్టింది. దీంతో స్పాట్​లో మృతిచెందాడు. నర్సంపేట రూరల్​ సీఐ సతీశ్​బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.