ఏపీలో 12 పెళ్లిళ్ల నిత్య పెళ్లికూతురు... అలాంటోళ్లే టార్గెట్... పెళ్లంటేనే భయపడేలా చేస్తున్నారు భయ్యా..

ఏపీలో 12 పెళ్లిళ్ల నిత్య పెళ్లికూతురు... అలాంటోళ్లే టార్గెట్... పెళ్లంటేనే భయపడేలా చేస్తున్నారు భయ్యా..

ఇటీవల వరుసగా జరుగుతున్న ఘటనలు పెళ్లి అనే మాట తలుచుకుంటేనే వణుకు పుట్టేలా చేస్తున్నాయి.. పెళ్లయ్యాక భర్తను హనీమూన్ తీసుకెళ్లి చంపేస్తుంది ఒక భార్య. పెళ్లైన నెలరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తుంది మరో భార్య... ఇలా ఒకటా రెండా, రోజు ఎదో ఒక మూల భార్య చేతిలో బలైపోయిన భర్తల గురించి వార్తలు వినాల్సి వస్తోంది. ఇప్పుడు ఏపీలో జరిగిన మరో ఘటన పెళ్లంటేనే భయపడేలా చేస్తోంది. ఏపీలో నిత్య పెళ్లికూతురు బాగోతం బయటపడింది.ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులనే టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్న ఖిలేడి గుట్టురట్టయింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

విడాకులు తీసుకున్న పురుషులే టార్గెట్ గా మోసానికి పాల్పడుతున్న నిత్య పెళ్లికూతురుపై కోనసీమ జిల్లాలో కేసు నమోదయ్యింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ అనే నిత్య పెళ్లి కూతురు.. సెక్షన్ 498 కేసులు ఎదురుకుంటున్న పురుషులనే టార్గెట్ గా చేసుకొని మోసాలకు పాల్పడుతోంది. ఈ ఖిలాడి వలకు చిక్కి మోసపోయిన నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది.

విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి వారిని పెళ్లి చేసుకొని, వారి నుండి అందినకాడికి నగదు కాజేసి... తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతోందని వాపోతున్నారు బాధితులు.రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు కాజేసినట్లు తెలుస్తోంది.

తమలాగా మరెవరూ మోసపోకూడదని.. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు బాధితులు. తమ నుంచి నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు బాధితులు. మొత్తానికి.. కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారు అందం చూసి, కట్నం కోసం.. ఆరాట పడకుండా..  కాస్త ముందు, వెనక చూసుకొని పెళ్లి చేసుకోవడం బెటరేమో....