ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచండి..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచండి..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

కరోనా యాంటిజెన్ టెస్టులు తగ్గించి, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువగా చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అన్ని రాష్ర్టాలకు లెటర్ రాసింది. కరోనా సోకిన వారిలో ఎక్కువ మందికి వైరస్ లక్షణాలు లేకపోవడం, ఇలాంటి వారికి యాంటిజెన్ లో నెగెటివ్ వస్తుండడంతో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది.ఏపీలో డిసెంబర్ నుంచి యాంటిజెన్ టెస్టులు పూర్తిగా బంద్ పెట్టాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో అలాంటి చర్యలేవీ ప్రారంభించకపోగా, ఆర్టీపీసీఆర్ టెస్టులు ఒకట్రెండు వేలు కూడా చేయడం లేదు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ధర కూడా రూ.50కి తగ్గిపోయింది. యాంటిజెన్ కిట్ టెస్టు ధర మాత్రం రూ.200 ఉంది. మన దగ్గర ప్రభుత్వ దవాఖాన్లలో టెస్టులు చేయకపోగా ప్రైవేటులో ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.వెయ్యికి పైగా వసూలు చేస్తున్నారు.

రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు