నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందే

నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందే
  • కేంద్రం నేత పరిశ్రమను దెబ్బతీయడానికి జీఎస్టీవేయాలని చూస్తోంది
  • మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల: మనకు నష్టం జరుగుతున్నప్పుడు తిరగబడాల్సిందేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తాత్కాలిక నిధులు ఇస్తామనడం తప్ప కేంద్రం ఏమి చేయట్లేదని ఆయన ఆరోపిచంారు. సిరిసిల్ల విద్యానగర్లో   సీసీ కెమెరాలను, మున్సిపాలిటీ కొనుగోలు చేసిన స్లీపింగ్ యంత్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు పవర్లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. గత ఏడున్నర సంవత్సరాలుగా తమకు అండగా నిలబడమని కోరుతున్నా  పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సిరిసిల్ల కు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అడిగినా మొండిచేయి చూపిస్తున్నారని మండిపడ్డారు. పవర్లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ లు అడిగినా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న నష్టం కోసం పోరాడితే పోయేది ఏం లేదని ఆయన పేర్కొన్నారు. 
రాష్ట్రంలోని నేతన్నలకు సహాయం చేయాలనే సోయి కేంద్రానికి లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. జిఎస్టీ వేసి నేత పరిశ్రమను దెబ్బతీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. తాత్కాలికంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేసిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్లో రాష్ట్రానికి మెండిచేయి చూపిందన్నారు. చేనేత కార్మికులకు మద్దతు గా మాట్లాడిన ఎల్ రమణకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని అర్దర్లు ఇక్కడి చేనేత కార్మికులకే ఇస్తున్నామన్నారు. మరోవైపు ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని తెలిపారు. వ్యవసాయం తరువాత చేనేత రంగంపైనే ఎక్కువ ఆధారపడి ఉన్నారని ఎన్నోసార్లు చెప్పాం.. ఎనిమిదో బడ్జెట్ లో కూడా ఏమి ఇవ్వలేదు.. మంత్రులను కలిసాం.. మోడీని కలిసినాము..అయినా ఏమి ఇవ్వలేదు.. అందుకే మనకు నష్టం జరుగుతోంది కాబట్టి ఎదురు తిరగబడాల్సిందేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

 

ఇవి కూడా చదవండి..

‘మహాన్’... ట్రైలర్ అదిరింది

ఎన్నికల ముందు చెప్పిన మాటలు చేతల్లో కనిపించట్లే

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పై దాడి