కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన కానిస్టేబుల్

కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన కానిస్టేబుల్

కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశారు. చైతన్యపురి పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న నరేష్.. నిన్నరాత్రి విధులు ముగించుకుని ఇంటికెళ్తూ పురుగుల మందు తాగాడు. తనకు కుటుంబ సమస్యలున్నాయని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పీఎస్ కు ఫోన్ చేసి చెప్పడంతో.. పోలీసులు నరేష్ కోసం వెతికారు. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న నరేష్ ను గుర్తించి ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.