జనగామ, వెలుగు: వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన కొత్తకొండ రాజన్న, సత్యలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం జనగామకు వచ్చి బాలాజీనగర్లో అద్దెకు ఉంటున్నారు. బచ్చన్నపేట మండలం కొడవటూరు పుణ్య క్షేత్రం వద్ద రాజన్న కొబ్బరికాయలు అమ్ముతుంటాడు. కూతురు పెళ్లయింది. కొడుకు సంతోష్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాజన్న(58) గుండెపోటుతో కొడవటూరులో చనిపోయాడు. కొడుకు సంతోష్అంబులెన్స్లో తండ్రి మృతదేహాన్ని జనగామకు తీసుకొస్తున్నట్లు ఇంటి ఓనర్ కు చెప్పాడు.
ఓనర్మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని అన్నాడు. జనగామ గ్రేన్మార్కెట్ఏరియాలో నివాసం ఉంటున్న రాజన్న అత్తగారిని అడగగా మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచేందుకు వారూ అంగీకరించలేదు. దీంతో నెహ్రూ పార్క్ సమీపంలోని శ్మశానవాటికకు మృతదేహంతో రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. ఓ బెంచీపై మృత దేహాన్ని ఉంచి తల్లి, నలుగురు మిత్రులతో కలిసి రాత్రంతా జాగారం చేశారు. మంగళవారం అంత్యక్రియలు పూర్తి చేశారు.