పెండ్లికి పెద్దలు ఒప్పుకోరని.. చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

పెండ్లికి పెద్దలు ఒప్పుకోరని.. చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

కోదాడ, వెలుగు: చెరువులో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్​లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోదాడలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన చేగొండి సాయి(20) స్థానిక ఇటుకల కంపెనీలో వర్క్ ​చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన బాలిక(17) ఉర్దూ స్కూల్​స్టూడెంట్. కొన్నాళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. బాలిక తండ్రి చనిపోవడంతో తల్లి ఆమె పోషణ చూస్తోంది. ఇటీవల వీరి ప్రేమ విషయం ఇద్దరి ఇండ్లలో తెలిసింది. పెద్దలు మందలించారు.

అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన జంట.. మన మతాలు వేరని, పెండ్లికి పెద్దలు ఒప్పుకునేలా లేరని గురువారం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పెద్ద చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. రాత్రి సమయంలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం చెరువు వైపు వెళ్లిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్​ ఇచ్చారు. వాళ్లొచ్చి డెడ్​బాడీలను బయటికి తీయించారు. పేరెంట్స్ ను పిలిపించారు. సాయి తండ్రి రామయ్య ఫిర్యాదుతో కేసు ఫైల్​ అయ్యింది.