ఎల్​బీ స్టేడియానికి పోటెత్తిన జనం

ఎల్​బీ స్టేడియానికి పోటెత్తిన జనం

తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు గురువారం ఎల్​బీ స్టేడియానికి జనం పోటెత్తారు. సిటీతో పాటు జిల్లాల నుంచి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బషీర్​బాగ్, ఎల్​బీ స్టేడియం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎల్​బీనగర్​కు చెందిన ఆర్టిస్ట్ నాగార్జునపు రాము  బియ్యం గింజలతో రేవంత్ రెడ్డి బొమ్మను గీసి శుభాకాంక్షలు తెలిపాడు.

– వెలుగు, ఫొటోగ్రాఫర్/ఎల్​బీనగర్

ALSO READ:-తెలంగాణ నూతన కేబినెట్​లో మిగిలిన 6 బెర్తుల్లో..ఎవరికి చాన్స్​?