
నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రానికి చెందిన బైరోజు శంకరయ్యకు గత నెలలో రూ. 630 కరెంటు బిల్లు వచ్చింది. ఈ నెలకు సంబంధించి గురువారం రీడింగ్తీసి రూ. 5,75,469 బిల్లు ఇవ్వడంతో షాక్ తిన్నారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బిల్లు సరిచేస్తామని తెలిపారు. – డిండి, వెలుగు