డ్రగ్స్​ అమ్ముతున్న ముఠా అరెస్ట్

డ్రగ్స్​ అమ్ముతున్న ముఠా అరెస్ట్

పంజాగుట్ట,వెలుగు :  డ్రగ్స్​ సప్లై ముఠాను సిటీ వెస్ట్​జోన్​టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకుని, వారి వద్ద రూ.2.28 లక్షల విలువైన 310 మిల్లీ లీటర్ల చరాస్​ఆయిల్​, 70 గ్రాముల చరాస్​,  ఏపీ10 బీఈ 9797, ఎఫ్​జెడ్ బైక్​ 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం... గోల్కొండకు చెందిన సయ్యద్​ముజాఫర్​అలీ, అతని ఫ్రెండ్​అబుబాకర్​డ్రగ్స్​కు బానిస అయ్యారు. ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు. వీరు ఫ్రెండ్​మహ్మద్​ఖాసీంతో అరకు వెళ్లి పాడేరులో రూ.80 వేలకు లీటర్​హాష్ ఆయిల్ కొని తెచ్చారు. 5 ఎంఎల్​బాటిల్స్ గా చేసి, ఒక్కోటి రూ.2 వేలకు అమ్ముతున్నారు. 

వారి వద్ద కొనుగోలు చేసి జీషన్ నవీద్, సయ్యద్​అన్వరుల్లా, హుస్సేని ఖాద్రి,  సయ్యద్​ముర్తజ్​అలీ, పూనమ్​కౌర్, నితిన్​గౌడ్​రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ పోలీసులు 7 మందిని అరెస్ట్​ చేసి ఫిలింనగర్​పోలీసులకు అప్పగించారు.  సిటీ కమిషనర్, డీసీపీ ఆదేశాల మేరకు టాస్క్​ఫోర్స్​వెస్ట్​జోన్ టీం ఎండీ ఖలీల్​ పాషా, ఇన్​స్పెక్టర్​ షేక్​ కవియుద్దీన్ పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్ చేశారు.