కరీంనగర్ జిల్లా: ఊరి బాగు కోసం ఓ సర్పంచ్ సరైన నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం జరిగిన గ్రామ సభలో మూడు ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెట్టగా.. అందుకు వార్డు సభ్యులు ఓకే అన్నారు.
(1) ఆడపిల్లలు, మహిళలు వేధింపులకి పాల్పడే పోకిరీలను గ్రామ బహిష్కరణకు తీర్మానం
(2) గ్రామంలో బెల్ట్ షాప్ లు నిషేధం
(3) గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుల ప్రతిష్ఠించాలని నిర్ణయం
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చిన్నపాపయ్య పల్లి గ్రామసభలో ఈ తీర్మానాలు చేశారు గ్రామ సర్పంచ్.