భారత్ ,ఇంగ్లాండ్ మధ్య కాసేపట్లో జరగాల్సిన 5వ టెస్టు రద్దు అయ్యింది. కరోనా కారణంగా మ్యాచ్ ను రద్దు వేస్తున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే టీమిండియా కోచ్ రవిశాస్త్రికి పాజిటివ్ రాగా..నిన్న జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ కొవిడ్ బారిన పడ్డాడు. భారత ఆటగాళ్లందరికీ కరోనా టెస్టులు చేశారు. అందరికీ నెగటివ్ వచ్చింది. అయితే ముందు జాగ్రత్తతో ఇంగ్లాండ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఐదు టెస్టుల సిరీస్ లో ఇండియా రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో ఉంది. ఒకటి డ్రా అవ్వగా..ఒకటి ఇంగ్లాండ్ గెలిచింది.
BREAKING: The fifth #ENGvIND Test in Manchester has been cancelled pic.twitter.com/xQJKmJGfQa
— ESPNcricinfo (@ESPNcricinfo) September 10, 2021