చిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి

చిరుత దాడి వల్లే చిన్నారి మృతి..ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడి

తిరుమల నడక దారిలో బాలిక లక్షితను చంపింది చిరుతేనని ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైంది . బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా చిరుత దాడి వల్లే చనిపోయిందని వైద్యులు తేల్చారు. బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతకుముందు ఎలుగుబంటి దాడితో చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేశారు డీఎఫ్ ఓ.  

టీటీడీ,ఫారెస్ట్ అధికారుల తీరును తప్పుబడుతున్నారు చిన్నారి తల్లిదండ్రులు . చిన్నారి మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారమని ఆరోపించారు. వరుసగా చిరుత దాడులు చేస్తుంటే అలిపిరి  మెట్ల మార్గాన్ని ఎందుకు మూసేయలేదని ప్రశ్నించారు. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆగస్టు 11  వారం రాత్రి 8 గంటల టైంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన కొండకు వెళ్తున్నారు. ఇదే టైంలో ముందు వెళ్తున్న చిన్నారిపై అడవిలో నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. పాప పేరంట్స్ భయంతో గట్టిగా అరవడంతో అడవిలోకి ఈడ్చుకెళ్లింది. చిరుత దాడి ఘటనపై చిన్నారి పేరంట్స్ రాత్రి 10 గంటలకు  పోలీసులకు కంప్లైంట్ చేశారు. రాత్రి టైం కావడంతో... గాలింపు చర్యలకు ఇబ్బంది కలిగింది. ఉదయం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. అప్పటికే చిన్నారి బాడీని చిరుత సగం వరకు తిన్నట్టు గుర్తించారు. 

చిన్నారి లక్షిత స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం. చిన్నారి తల్లిదండ్రులు దినేష్ కుమార్, శశికళ ఇతర కుటుంబ సభ్యులు... సంతోషంగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.