ఫాంహౌస్ కేసు : సీబీఐకి విచారణపై హైకోర్టులో సర్కార్ అప్పీల్

ఫాంహౌస్ కేసు : సీబీఐకి విచారణపై హైకోర్టులో సర్కార్ అప్పీల్

ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. సిట్ దర్యాప్తు సాగించాలని డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐకీ కేసు బదిలీ నిలిపివేయాలని ఆ పిటీషన్ లో కోరింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ను సీజే ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

సింగిల్ బెంచ్  ఆర్డర్ కాపీలో ఏముంది ? 

ఫాంహౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇటీవలె తీర్పునిచ్చింది. ఆ తీర్పు కాపీ ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని జడ్జి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి  సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి  ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను  బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం  న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు.

ఇక ఈ కేసుకు సంబంధించి బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో డిస్మిస్ అయింది.  నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..  జీవో 63 ద్వారా ఏర్పాటుచేసిన సిట్ ను రద్దు చేసింది. ఎఫ్ ఐ ఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేసి.. సిట్ చేసిన దర్యాప్తును రద్దు చేసింది.