ఓల్డ్ బుక్స్ కోసం ప్రిన్సిపాల్స్ వేట

ఓల్డ్ బుక్స్ కోసం ప్రిన్సిపాల్స్ వేట
  • తెలుగు అకాడమీలోపేపర్ కొరత.. ప్రింటింగ్ సమస్యలే కారణం
  • టీసీలు కావాలంటే పుస్తకాలు ఇవ్వాలనే నిబంధన
  • చదువులు సాగక విద్యార్థుల ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రభుత్వ జూనియర్​కాలేజీలకు పాఠ్యపుస్తకాలు ఇంకా రాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సరిపడా పుస్తకాలు పంపిణీ చేయాల్సిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కాలేజీలు మొదలై రెండు నెలలైనా బుక్స్​రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోనే కాలేజీల ప్రిన్సిపాల్స్​ఇంటర్​పూర్తి చేసుకున్న విద్యార్థుల పుస్తకాలను తెప్పించే పనిలో పడ్డారు. ఇంటర్​పాస్​అయి టీసీ కోసం వచ్చే స్టూడెంట్స్ ఓల్డ్​బుక్స్​ఇస్తేనే ట్రాన్స్​ఫర్​సర్టిఫికెట్​ఇస్తామని  ఖరాకండీగా చెబుతున్నారు. దీంతో ఇటు టీసీల కోసం పాసౌట్​అయిన స్టూడెంట్స్​ఇబ్బందులు పడుతుండగా..పాత, చినిగిపోయిన పుస్తకాలతో ఇంటర్​చదివే వారు అవస్థలు పడుతున్నారు.

రెండున్నర నెలలవుతున్నా.. 

ఈ ఏడాది జూన్​15 నుంచి ఇంటర్మీడియట్​కాలేజీలు మొదలయ్యాయి. అప్పటికే సర్కారు పుస్తకాలు పంపించాల్సి ఉండగా పట్టించుకోలేదు. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 47 ప్రభుత్వ కాలేజీలుండగా.. అందులో ఫస్ట్, సెకండ్​ఇయర్​రెగ్యులర్​, ఒకేషనల్ కోర్సుల్లో దాదాపు 30 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్​లో ఎంపీసీ, బైసీపీ, హెచ్ఈసీ, సీఈసీ తో పాటు ఒకేషనల్​ కోర్సులు చదువుతున్న వారికి సుమారు లక్షన్నర బుక్స్​ అవసరమవుతాయని జిల్లా ఆఫీసర్లు ఇండెంట్ పంపారు. కానీ కాలేజీలు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఒక్క పుస్తకం కూడా పంపలేదు. 

తెలుగుఅకాడమీలో పేపర్ల కొరతతోనే..

రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన పుస్తకాలను ముద్రించే తెలుగు అకాడమీలో పేపర్​కొరత, ప్రింటింగ్   సమస్యలే బుక్స్​రాకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభానికి మూడు, నాలుగు నెలల ముందే కాగితం కొనుగోలుకు టెండర్లు పిలిచి పుస్తకాలు ప్రింట్ చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా తరువాత పేపర్​కాస్ట్​పెరిగిపోగా.. కాంట్రాక్టు సంస్థలు పాత రేటుతో పేపర్​అందించడానికి ముందుకు రాలేదని తెలిసింది. ఆఫీసర్లు, కాంట్రాక్టర్ల సంప్రదింపుల తరువాత పేపర్​ తెప్పించినప్పటికీ.. ప్రింటింగ్​ఛార్జీల విషయంలో మరోసారి ఆటంకాలు ఏర్పడ్డాయి. పేపర్​కాస్ట్​ పెరిగిపోగా..ప్రింటింగ్​ఛార్జీలు కూడా పెంచాలని సంబంధిత కాంట్రాక్టర్లు డిమాండ్​ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు, ఆఫీసర్ల మధ్య చర్చలతోనే టైం వృథా అయ్యింది. చివరకు ఆలస్యంగా ప్రింటింగ్ మొదలుపెట్టగా అది కూడా అరకొరగానే చేస్తున్నట్టు తెలిసింది.  

ప్రైవేట్​ బుక్​స్టాల్స్​కు ఇంటర్​ బుక్స్​

సర్కారు కాలేజీల్లో ఇంటర్​పాఠ్యపుస్తకాల కొరత వేధిస్తుండగా ప్రైవేట్​బుక్​స్టాల్స్​నిర్వాహకులకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు అకాడమీ ప్రింట్​చేసే బుక్స్​సైతం ముందు ప్రైవేట్​బుక్​స్టాల్స్​కే చేరుతున్నట్టు సమాచారం. దీంతో సిలబస్​ మిస్​కాకుండా ఉండేందుకు సర్కారు కాలేజీల విద్యార్థులు బుక్స్​స్టాల్స్​లో కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.  

పాత బుక్స్​ఇస్తేనే టీసీలు ! 

పుస్తకాలు రాకపోవడంతో కాలేజీల ప్రిన్సిపాల్స్ మరో దారి చూసుకోవాల్సి వచ్చింది. కాలేజీల్లో ఇంటర్​పూర్తి చేసిన విద్యార్థులు వేరే కళాశాలల్లో జాయిన్​ కావడానికి టీసీల కోసం వస్తున్నారు. వీరు తప్పనిసరిగా పాత పుస్తకాలు ఇస్తేనే టీసీలు ఇస్తామని కాలేజీల్లో స్టాఫ్​తెగేసి చెబుతున్నారు. ఇంటర్​తర్వాత ఎంసెట్, నీట్, మరికొన్ని ప్రవేశ పరీక్షలు రాసేవారు లాంగ్​టర్మ్​ కోచింగులు తీసుకుంటుంటారు. వీరికి పాత బుక్స్​అవసరం ఉంటుంది. కానీ పుస్తకాలను తిరిగివ్వాల్సిందిగా ప్రిన్సిపాల్స్​ఆర్డర్​ వేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది వాపస్​చేస్తుండగా, మరికొందరు తమకు అవసరం ఉందని బతిమిలాడుకుంటున్నారు.  

చినిగిన బుక్స్​తో సర్ధుకుపోతున్నం 

కాలేజీల్లో పుస్తకాల కొరత కారణంగా మా లెక్చరర్లు ఇంటర్ పాసైన స్టూడెంట్ల బుక్స్​ఇప్పించారు. అందులో చాలావరకు చినిగిపోయి ఉంటున్నాయి. కొన్ని బుక్స్​ఓపెన్​చేయగానే పేపర్లు ఊడిపోతున్నాయి. మధ్యలో కొన్ని పేజీలు మిస్​కావడంతో చదవడానికి ఇబ్బంది అవుతోంది. తొందరగా మాకు బుక్స్​పంపించాలి.  - శ్రీరామోజుల లహరి, హనుమకొండ

పాత బుక్స్ ఇస్తేనే టీసీ ఇస్తరట 
నేను సీఈసీ చదివాను. డిగ్రీలో జాయిన్​కావడానికి టీసీ తీసుకుందామని వస్తే పాత పుస్తకాలు ఇచ్చి టీసీ తీసుకోవాలని చెబుతున్నారు. నాకు ఇంటర్​బుక్స్​అవసరం ఉంది. కానీ రిటర్న్​చేయాలని అడుగుతుండడంతో ప్రైవేట్​లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. - రచ్చ నితిన్​, నర్సంపేట

ఇండెంట్ పంపించినం

ఇంటర్​పుస్తకాల కొరత ఉన్నది వాస్తవమే. ఇప్పటికే జిల్లాలో అవసరాన్ని బట్టి ఇంటర్మీడియట్​బోర్డుకు ఇండెంట్ పంపించాం. అక్కడి నుంచి బుక్స్ రాగానే విద్యార్థులకు అందజేస్తాం. అప్పటివరకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. - ఏ.గోపాల్, డీఐఈఓ, హనుమకొండ