హాస్టళ్లకు సొంత బిల్డింగ్​లు నిర్మించాలి : ఎం. ఆది

హాస్టళ్లకు సొంత బిల్డింగ్​లు నిర్మించాలి : ఎం. ఆది

వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం వెంటనే సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. ఆది డిమాండ్  చేశారు. సోమవారం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి ఎస్ఎఫ్ఐ సమరభేరి జీపు యాత్ర చేపట్టామన్నారు.

ఈ యాత్రలో అనేక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని కోరుతూ, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించామన్నారు. అనంతరం కలెక్టరేట్  ఏవో భానుప్రకాశ్​కు వినతిపత్రం అందించారు. జిల్లా ఉపాధ్యక్షుడు మొగిలి, రాఘవ, కుమార్, యుగంధర్, అవినాశ్,​ మల్లేశ్, ప్రసాద్, ఈశ్వర్, మహేశ్, వెంకటేశ్​ పాల్గొన్నారు.