చైనా జియాంగ్జీ ప్రావిన్స్లో రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

చైనా జియాంగ్జీ  ప్రావిన్స్లో రోడ్డు ప్రమాదం..17 మంది మృతి

తూర్పు చైనాలో జియాంగ్జీ ప్రావిన్స్‌లో  ఘోర రోడ్డు ప్రమాదం  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  17 మంది మృతి చెందగా.... మరో 22 మందికి గాయాలయ్యాయి. నాన్‌చాంగ్ కౌంటీలోని హైవేపై అర్థరాత్రి  ఒంటి గంటకు  ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఘటనా స్థలికి చేరుకున్న నాన్‌చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

పొగ మంచు నేపథ్యంలో డ్రైవింగ్ పై  పోలీసులు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. హైవేపై డ్రైవింగ్ విజిబిలిటీ తక్కువగా ఉందని...ఇది  ప్రమాదాలకు కారణమవుతుందన్నారు.  ఫాగ్ లైట్లు ఆన్ చేసి..నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. వాహనానికి వాహనానికి మధ్య  సురక్షితమైన దూరం పాటించాలన్నారు. లేన్‌లను మార్చొద్దని... ఓవర్ టేక్ చేయొద్దని పొలీసులు సూచించారు.