గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు 

గంటకు 350 కి.మీ వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు 

నాగ్ పూర్-ముంబై మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా బుల్లెట్ రైలు సర్వీస్ ను ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ముంబై-నాగ్ పూర్ మధ్య హై స్పీడ్ రైలు కారిడార్ కు సంబంధించిన డీపీఆర్ ను ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో పూర్తవుతుందని కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే తెలిపారు. ఏడు హైస్పీడ్ రైలు కారిడార్ లలో ముంబయి-నాగ్ పూర్ హై స్పీడ్ కారిడార్ ఒకటని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టకు సంబంధించిన 30 శాతం భూమిని ప్రైవేటు వ్యక్తుల వద్ద నుంచి సేకరిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

 

ఓటేసినోళ్ల కోసం ఆఫర్లు

పుల్వామా ఘాతుకానికి ఇవాళ్టితో మూడేళ్లు