పూరీ తీరాన యోగా డే

పూరీ తీరాన యోగా డే

ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన అంతర్జాతీయ యోగా దినోత్స వేడుకలు ఘనంగా జరిగాయి.  ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సాండ్ ఆర్ట్ను రూపొందించాడు. ప్రధాని మోడీ యోగా చేస్తున్నట్లుగా ఇసుకతో బొమ్మను రూపొందించాడు.  సూర్య నమస్కార్, యోగా డే అని సైకత శిల్పంపై  రాశాడు.  మోడీ సైకత శిల్పం దగ్గరకు పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకుని యోగా చేశారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 నుండి ఏటా జూన్ 21న జరుపుకుంటున్నారు.