చావును ఎదిరించి.. మంటల్లో నుంచి నడిచొచ్చిన మృత్యుంజయుడు.. విమాన ప్రమాదంలో బతికిన ఒకేఒక్కడు

చావును ఎదిరించి.. మంటల్లో నుంచి నడిచొచ్చిన మృత్యుంజయుడు.. విమాన ప్రమాదంలో బతికిన ఒకేఒక్కడు

అహ్మదాబాద్:  అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడాడు.11ఏ నంబర్ సీట్లోని ప్యాసింజర్ విశ్వాస్ కుమార్ రమేశ్(40) ప్రమాదం నుంచి సజీవంగా బయటపడినట్లు అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ వెల్లడించారు. విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ కు స్వల్ప గాయాలయ్యాయని..ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. 

మృత్యుంజయుడిగా నిలిచిన విశ్వాస్ కుమార్ రమేశ్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో అతను తెల్లటి టీ-షర్టు, డార్క్ ట్రౌజర్స్‌‌‌‌ ధరించి కాలికి గాయాలతో నడుస్తూ కనిపించాడు. అతని బట్టలపై రక్తపు మరకలు, నల్లటి పొగ మచ్చలు స్పష్టంగా కనిపించాయి. విశ్వాస్ ఒక  బ్రిటిష్ -ఇండియన్ అని.. అతను తన సోదరుడితో కలిసి ఇండియా విజిట్ చేసినట్లు అధికారులు తెలిపారు. 

గురువారం (June 13) ఇద్దరూ కలిసి తిరిగి యూకేకి బయల్దేరారని తెలిపారు. అంతలోనే విమాన ప్రమాదం జరిగిందని..విశ్వాస్ ప్రాణాలతో బయటపడగా..అతని సోదరుడి ఆచూకీ ఇంకా లభించలేదని పేర్కొన్నారు.