మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ నిరసన వ్యక్తం చేశాడు. చేసిన అభివృద్ధి పనులకు రెండేళ్లుగా బిల్లులు రాక అప్పుల పాలయ్యామని నారాయణపురం గ్రామానికి చెందిన TRS ఎంపీటీసీ రవి నాయక్ ఆరోపించాడు. కేసముద్రం మండల సమావేశంలో ప్లకార్డులతో నిరసన తెలిపాడు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను కలిసి విషయం చెప్పినా ఫలితం లేదన్నాడు. ప్రభుత్వమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు.
మరిన్ని వార్తల కోసం..
పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు స్టైపెండ్ ఇవ్వాలె
బండి సంజయ్కి మంత్రి కేటీఆర్ నోటీసులు.. ఆధారాలుంటే బయటపెట్టాలి