- ఎడ్యుకేషన్, హౌసింగ్ లోన్లు తగ్గినయ్
- కరోనా ఎఫెక్ట్తో ఆర్థికంగా చితికిపోయిన జనం
- పిల్లల ఉన్నత విద్య, ఇండ్ల నిర్మాణాలు వాయిదా
- లోన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతలే
- రాష్ట్ర సర్కార్కు ఎస్ఎల్బీసీ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడ్యుకేషన్, హౌసింగ్ లోన్లు తీసుకునే వారి సంఖ్య తగ్గింది. రెండేండ్లుగా ఈ లోన్ల టార్గెట్ను రీచ్ కావడం లేదు. కరోనా ఎఫెక్ట్తో జనం ఫైనాన్షియల్గా దెబ్బతినడం, కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోతతో లోన్లు తీసుకునే వారి సంఖ్య తగ్గినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) అభిప్రాయపడింది. ఈ మేరకు 2021–22 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో తీసుకున్న లోన్లు, సెకండ్ క్వార్టర్లో ఎలా ఉందనే దానిపై సర్కార్కు బుధవారం రిపోర్టు ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చూస్తే గడిచిన, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్, హౌసింగ్ లోన్లు బ్యాంకులు తక్కువగా ఇచ్చాయి. ఈ ఏడాది టార్గెట్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు హౌసింగ్లో 9.47%, ఎడ్యుకేషన్ కింద 5.40% లోన్లు మాత్రమే ఇచ్చాయి.
ఎడ్యుకేషన్ లోన్లు ఇట్లా..
పిల్లలను విదేశాల్లో చదివించేందుకు ఎక్కువ మంది ఎడ్యుకేషన్ లోన్లు తీసుకుంటుంటారు. ఇందుకోసం బ్యాంకులు గ్యారంటీ లు పెట్టుకోకపోయినా పక్కా పే స్లిప్ వంటివి పరిగణనలోకి తీసుకుంటాయి. కరోనా ఎఫెక్ట్తో ప్రైవేట్ సెక్టార్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారి నెలవారీ ఖర్చులకే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. ఫలితంగా పిల్లల ఉన్నత చదువులను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని బ్యాంకర్లు సర్కార్కు తెలిపారు. అదే టైంలో చాలా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతో లోన్లు తగ్గినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖర్చులు తగ్గించుకున్నారని, దీని ప్రభావంతోనే టార్గెట్ రీచ్ కాలేకపోయినట్లు పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ లోన్లు 2019–20లో రూ. 977.13 కోట్లు ఇవ్వగా.. 2020–21లో రూ. 693 కోట్లు ఇచ్చారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే నిరుడు దాదాపు రూ. 300 కోట్లు తగ్గాయి. ఈ ఏడాది రూ. 2,347 కోట్లు భారీ టార్గెట్ పెట్టుకోగా.. ఫస్ట్ క్వార్టర్లో కేవలం రూ.126.71 కోట్లు ఇచ్చారు. సెకండ్ క్వార్టర్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది.
హౌసింగ్ లోన్లు ఇట్లా..
కరోనా ఎఫెక్ట్ నిర్మాణ రంగంపై కూడా తీవ్రంగా పడిందని ఎస్ఎల్బీసీ పేర్కొంది. గృహ నిర్మాణాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయని రిపోర్టులో తెలిపింది. హౌసింగ్ లోన్లకు చాలా బ్యాంకులు వారి పరిధిలో ఇంట్రెస్ట్ రేట్లను సవరించినప్పటికీ అనుకున్న స్థాయిలో లోన్లు తీసుకోలేదని వివరించింది. ఖర్చులు తగ్గించుకోవాలనే జనాల ఆలోచనతో పాటు నిర్మాణ వ్యయం పెరగడం కూడా లోన్లపై ఎఫెక్ట్ చూపిందంది. హౌసింగ్ లోన్లు 2019–20లో రూ. 5,099 కోట్లు ఇవ్వగా.. 2020–21లో రూ. 4,162 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే దాదాపు రూ. వెయ్యి కోట్లు తగ్గింది. ఈ ఏడాదిలో టార్గెట్రూ. 8,640 కోట్లు కాగా.. ఫస్ట్ క్వార్టర్లో రూ. 818 కోట్లు మాత్రమే బ్యాంకులు పంపిణీ చేశాయి. నిర్దేశించుకున్న లక్ష్యంలో 9.47 శాతమే ఇచ్చాయి. రెండో క్వార్టర్లోనూ అనుకున్నంతగా లోన్లు తీసుకోలేదని రిపోర్టులో ఎస్ఎల్బీసీ పేర్కొంది.
జోరుగా ఎంఎస్ఎంఈ లోన్లు
మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్లు పెరుగుతున్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ మొదటి 3 నెలల్లోనే టార్గెట్లో 30% వరకు లోన్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ ఏడాది రూ. 1,3451 కోట్లు టార్గెట్ ఉంటే ఫస్ట్ క్వార్టర్లోనే రూ. 11,689 కోట్లు ఇచ్చాయి.