దేశంలోనే అత్యధిక వయస్సు ఉన్న రాజా పులి పశ్చిమ బెంగాల్ లో కన్నుమూసింది. సోమవారం (జులై 11న) తెల్లవారుజామున 3 గంటలకు మృతిచెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. చనిపోయిన పులి వయస్సు 25 సంవత్సరాల10 నెలలు ఉంటుందని చెప్పారు. SKB రెస్క్యూ సెంటర్కు చెందిన ఈ పులి... భారత్ లోనే ఎక్కువ కాలం జీవించి ఉన్న పులులలో ఒకటిగా నిలిచిందని తెలిపారు.
West Bengal | Raja - the tiger from SKB rescue center, died today around 3 AM at the age of 25 years and 10 months making it one of the longest surviving tigers in the country. pic.twitter.com/kg7l5UFFu7
— ANI (@ANI) July 11, 2022
2008 ఆగష్టులో నార్త్ బెంగాల్ సుందర్బన్ అడవుల్లో ఓరోజు మొసలితో పోరాడి తీవ్రంగా గాయపడ్డ రాయల్ బెంగాల్ టైగర్ను.. సౌత్ ఖైర్బరి టైగర్ రెస్క్యూ సెంటర్కు తీసుకొచ్చారు. నిర్వాహకులు శ్రమించి దానిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘రాజా’ దాదాపు పదిహేనేళ్లు బతికింది. తద్వారా దేశంలో సుదీర్ఘ కాలం జీవించిన పెద్దపులి(అధికారుల అంచనా)గా రాజా(25 ఏళ్ల 10 నెలలు) రికార్డుకెక్కింది. రాజా మృతిపై నిర్వాహకులతో పాటు పలువురు సోషల్ మీడియాలో ‘ వీ మిస్ యూ రాజా’ అంటూ నివాళులు అర్పిస్తున్నారు. దానిని చూసేందుకు సందర్శకులు చాలామంది వచ్చేవారని అధికారులు తెలిపారు.
Alipurduar, WB | People pay tribute to 25-year-old tiger Raja from SKB rescue centre who passed away today
— ANI (@ANI) July 11, 2022
(Source: DM & DFO Alipurduar) pic.twitter.com/pkxS7Q5CgP