భూవివాదంలో యజమానిపై దాడి.. నిందితులను చెట్టుకు కట్టేసిన స్థానికులు

భూవివాదంలో యజమానిపై  దాడి.. నిందితులను చెట్టుకు కట్టేసిన స్థానికులు

భూవివాదంలో యజమానిపై దాడికి పాల్పడ్డ నిందితుల్ని స్థానికులు చెట్టుకు కట్టేసిన ఘటన కరీంనగర్ లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూరు మండలం చెంజర్లలో సంఘమిత్ర సీడ్ ప్లాంట్​యజమాని గురజాల జయరామయ్యను భూవివాదంలో ఓ ముగ్గురు బెదిరించి దాడి చేశారు. 

ఆయనపై దాడి చేస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు దాడిని అడ్డుకుని ముగ్గురిని బంధించి చెట్టుకు కట్టేశారు.  అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. 

జయరామయ్య కొనుగోలు చేసిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మిస్తుండగా ఆ స్థలం తమదేనంటూ  తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామానికి చెందిన రాజు గౌడ్, కరుణాకర్, దివాకర్ లు అడ్డుపడ్డారు.