Pakistan Cricket Board: 8 నెలలకే మార్చేశారు.. పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్

Pakistan Cricket Board: 8 నెలలకే మార్చేశారు.. పాకిస్థాన్ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్

క్రికెట్ అభిమానులకు ఇదేం కొత్త విషయం కాకపోవచ్చు. సిరీస్ ఓడిన ప్రతిసారి పాకిస్తాన్ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు సదా మామూలే. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓటములకు బాధ్యులైన ఆటగాళ్లను తప్పించాల్సింది పోయి కోచ్‌లను మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటిదే జరిగింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ టెస్ట్ జట్టుకు కొత్త కోచ్ ను నియమించింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోమవారం (జూన్ 30) పాక్ రెడ్-బాల్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మాజీ ఆల్ రౌండర్ అజార్ మహమూద్‌ను నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన గంటల వ్యవధిలోనే ఆ జట్టు ప్రధాన కోచ్ జేస‌న్ గిలెస్పీపై వేటు వేసింది. గిలెస్పీ స్థానంలో గత ఏడాది నవంబర్ లో ని పాక్ క్రికెట్ బోర్డు ఆ జట్టు మాజీ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను నియమించగా.. 8 నెలల తర్వాత జావేద్ స్థానంలో తాజాగా ఆల్ రౌండర్ అజార్ మహమూద్‌ను తీసుకొచ్చి ఆశ్చర్యపరించింది.

2016 నుంచి 2019 మధ్య పాకిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం మహమూద్ కు ఉంది. 2023లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతను స్టాండ్-ఇన్ హెడ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. పాక్ డొమెస్టిక్ క్రికెట్ లో కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్‌ల జట్లకు బౌలింగ్ కోచ్‌గా.. ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రధాన కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. 1996 నుంచి 2007 వరకు మధ్య కాలంలో పాకిస్థాన్ జట్టు తరపున మహమూద్ ప్రాతినిధ్యం వహించాడు. పాక్ తరపున 21 టెస్టులు, 143 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో 100 కంటే ఎక్కువ వన్డే వికెట్లు తీయడంతో పాటు మూడు సెంచరీలు చేశాడు. 

►ALSO READ | MLC 2025: ఇతనికి వయసు నెంబర్ మాత్రమే: 40 ఏళ్ళ వయసులో సెంచరీ.. బట్లర్, రోహిత్ సరసన ఫాఫ్

2025 టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా అక్టోబర్ లో పాకిస్థాన్ తమ తొలి సిరీస్ సౌతాఫ్రికాతో ఆడనుంది. మహమూద్ కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తోలి సిరీస్ ఇదే. పాకిస్తాన్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో ఘోరంగా ఆడింది. పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో నిలిచింది. ఐదు విజయాలు సాధించిన పాక్.. తొమ్మిది ఓటములతో 27.98 పాయింట్ల శాతాన్ని సాధించారు. 2023-24 మధ్య వరుసగా ఆరు టెస్ట్ పరాజయాలు ఉన్నాయి.